'ఎవరికి ఏ పదవో తెలియదు: జగన్ పార్టీలో లుకలుకలు'

పార్టీ కార్యాలయాలు దేవాలయాలతో సమానమని.. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికి వెళుతున్నారో చూసుకోవాలని అన్నారు. చంచల్గూడ జైలుకు వెళ్లి కలవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే పేదలకు వడ్డీ లేని రుణాలిస్తాడంటూ షర్మిల పాదాయాత్రలో చెబుతున్నారని, మరి ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న పావలా వడ్డీ పథకం గురించి ఆమెకు అవగాహన లేనట్లుగా కనిపిస్తోందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పగటి వేషగాడిలా ఊరూరా తిరుగుతున్నారన్నారు. ఆయనకు సంస్కారం లేదని, ఎవరిని ఎలా సంభోధించాలో కూడా తెలియదన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని జైలులో నిర్వహించుకునే రోజు వస్తుందనే మాటలు సరికాదన్నారు. తనపై ఆరోపణలు రాగానే చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారన్నారు. విచారణ జరిగి ఉంటే అక్రమాలకు పాల్పడ్డారో లేదో తెలిసి ఉండేదన్నారు.












Click it and Unblock the Notifications