ఢిల్లీ గ్యాంగ్ రేప్: పోలీసు వైఫల్యంపై ఉషా మెహ్రా విచారణ
అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసే విషయంలో పోలీసులు జోక్యం చేసుకున్నారని వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని షీలా దీక్షిత్ షిండేకు రాసిన లేఖలో కోరారు. బాధితురాలి వాంగ్మూలానికి, పోలీసుల కథనానికి మధ్య పొంతన లేదని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పరువు కోసం పాకులాడుతున్న నేపథ్యంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉషా మెహ్రా చండీఘడ్లోని పంజాబ విశ్వవిద్యాలయం నుంచి బిఎ, ఎల్ఎల్బి పట్టా తీసుకున్నారు. ఢిల్లీలో హైకోర్టు రిజిస్ట్రార్గా ఆమె 1984లో నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్గా నియమితులైన తొలి మహిళ ఆమె. 1990లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదిలావుంటే, అత్యాచార బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణించింది. రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు చెప్పారు. శరీరంలో రక్తస్రావం జరగడం సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైందని వైద్యులు చెప్పారు. అయితే, ప్లేట్లెట్ కౌంట్స్ మాత్రం పెరిగాయని చెప్పారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగితే అవయవయాలు చచ్చుపడే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె ఇంకా వెంటిలేటర్పైనే ఉన్నట్లు చెప్పారు.