వైయస్సార్ ఎస్టేట్: రిపుంజయ్ ఆస్తులు రూ. 75 కోట్లు

రిపుంజయ్ రెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు డిసెంబర్ 26వ తేదీన అరెస్టు చేశారు. తన వేతనంతో, జెఎన్టియు ఫ్యాకల్టీ సభ్యురాలైన తన భార్య వేతనంతో గత ఐదేళ్లుగా తాను ఆస్తులు కొనుగోలు చేసినట్లు రిపుంజయ్ రెడ్డి చెప్పాడు. దీంతో అతని పిల్లలు, భార్య, తల్లిదండ్రులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలో కోసం ఎసిబి అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, బెంగళూర్, కడప, చిత్తూరు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు.
కడప జిల్లాలోని రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పీలేరు, వాయల్పాడుల్లో 32 ఎకరాల భూమి ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అలాగే బెంగళూర్లోని అనేకల్లో ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు కనిపెట్టారు. హైదరాబాదులోని మాదాపూర్, కొండాపూర్ల్లో జి+4 అపార్టుమెంట్లు ఉన్నట్లు కూడా ఎసిబి అధికారులు గుర్తించారు. రిపుంజయ్ రెడ్డి భార్య రమాదేవి పేరు మీద ఉన్న కరూర్ వైశ్యా బ్యాంక్ జూబ్లీహిల్స్ శాఖలోని లాకర్ను తెరిచి, 1.5 కిలోలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రమాదేవి జెఎన్టియులో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
కడప జిల్లాలోని గుట్లపల్లి, రాయచోటిల్లో, చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో 36 ఎకరాల వ్యవసాయ భూములు, వాటితో పాటు ఐదు ప్లాట్లు, ఆరు ఫ్ల్టాట్లు హైదరాబాదులో ఉన్నట్లు ఎసిబి అధికారులు డిసెంబర్ 26వ తేదీన జరిపిన తనిఖీల్లో కనిపెట్టారు. ఎసిబి అధికారులు 63 తులాల బంగారం, 3.5 కిలోల వెండి, 12 లక్షల విలువ చేసే రెండు కార్లు, 30.5 లక్షల ఎఫ్డి ఉన్నట్లు కూడా తేలింది.
తన, తన భార్య వేతనంతోనే ఆస్తులన్నీ కొనుగోలు చేసినట్లు రిపుంజయ్ రెడ్డి ఎసిబి అధికారుల విచారణలో చెప్పారు ఆయన నెలసరి వేతనం లక్ష రూపాయలు కాగా, ఆయన భార్య నెలసరి వేతనం 70వేల రూపాయలు. తన ఆస్తుల వివరాలను కూడా ఆయన ఎసిబి అధికారులకు వివరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications