తెలంగాణకు అడ్డు చెప్పలేదు, విష ప్రచారం: గాదె వ్యాఖ్య

నాయకుల మాటలను వక్రీకరించవద్దని సూచించారు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోందని, అది సరికాదని ఆయన అన్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై అధిష్టానం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఆయన అన్నారు. విభేదాలంటూ విష ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్ర ప్రజల నిర్ణయాన్ని మాత్రమే తాము అధిష్టానానికి చెప్పామన్నారు.
జెఏసి నేతల అరెస్టు సరికాదు
సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా సమావేశం జరపుకునేందుకు అనుమతి తీసుకునేందుకు యత్నించిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలను అరెస్టు చేయడం సరికాదని మంత్రి శైలజానాథ్ అంతకుముందు వేరుగా అన్నారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధిష్టానానికి సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలియజేశామన్నారు. నిన్నటి సమావేశం ద్వారా అధిష్టానానికి సమైక్యాంధ్ర గళం వినిపించిందన్నారు.
తెలంగాణపై చర్చించకపోవచ్చు
జైపూర్ మేధోమథనం సదస్సులో తెలంగాణ అంశంపై చర్చించక పోవచ్చునని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు జైపూర్లో అన్నారు. తమ ముందు రాష్ట్రంలో మూడు సవాళ్లు ఉన్నాయని.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని ఎదుర్కొవడం ఒకటి, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ ఆరోపణలు తిప్పి కొట్టడం రెండోది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం మూడోది అన్నారు.












Click it and Unblock the Notifications