వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై లగడపాటికి విహెచ్: కెవిపి ఇంటి వద్ద పహారా

By Srinivas
|
Google Oneindia TeluguNews

KV P Ramachandra Rao - V Hanumantha Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి కనువిప్పు కలిగిస్తానని వస్తున్నా మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో హంగామా చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సూచన చేశారు. తెలంగాణపై బాబుకు కనువిప్పు కలిగించడం కాకుండా.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కలిగించాలని సూచించారు.

లగడపాటికి దమ్ముంటే జగన్ కనువిప్పు యాత్ర చేపట్టాలన్నారు. బాబు తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ కనిపించిన ప్రజల భావోద్వేగాలు, ఆత్మహత్యలను చూసి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని విహెచ్ చెప్పారు. అలాంటి చంద్రబాబుకు కనువిప్పు అంటూ లగడపాటి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు దమ్ముంటే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, యువనేత రాహుల్ గాంధీని జగన్ విమర్శించినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు.

కెవిపి నివాసం వద్ద పోలీసుల పహారా

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు ఇంటి వద్ద సోమవారం పోలీసులు మోహరించారు. బంజారాహిల్సులోని ఏడో నెంబరు రహదారిలోని ఆయన ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించనున్నారనే సమాచారం అందడంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

కెవిపి నివసిస్తున్న దుర్గా పామ్ అపార్టుమెంటులోనికి వెళ్లేందుకు వీలులేకుండా ఇనుప ముళ్లకంచెతో దారిని మూసేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ న్యాయవాదులు అక్కడకు వస్తారని ప్రచారం జరిగింది. అయితే నాలుగు గంటల వరకూ ఎవరూ రాకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

English summary
Congress party senior leader V Hanumantha Rao suggested Vijayawada MP Lagadapati Rajagopal on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X