తెలంగాణపై తెలియదన్న వాయలార్: పోటాపోటీ భేటీలు

కేంద్ర మంత్రి వాయలార్ రవి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూడా తెలంగాణపై ఏ విధమైన సంకేతాలు ఇవ్వలేదు. తెలంగాణపై ఈ నెల 28వ తేదీన ప్రకటన వస్తుందో, రాదో తనకు తెలియదని ఆయన అన్నారు. జైపూర్ డిక్లరేషన్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించామని, దాని కిందికి తెలంగాణ వస్తుందో రాదో మీడియానే అన్వయించుకోవాలని ఆయన మంగళవారం సాయంత్రం అన్నారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో మాత్రం తెలంగాణ అంశం ఉందని అంగీకరించారు. ఇరు ప్రాంతాల్లో ఇప్పుడు వేడి పుట్టిందని ఆయన అన్నారు. తన వద్దకు వచ్చిన నేతలతో సమావేశమవుతూనే ఉంటానని ఆయన చెప్పారు.
తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించే గడువు సమీపించడంతో సీమాంధ్ర నేతలు విభజనను ఆపడానికి చివరి ప్రయత్నం చేస్తుండగా, విభజనకు అనుకూలంగా నిర్ణయం రాబట్టుకోవడానికి తెలంగాణ నేతలు ఆఖరు ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు మంగళవారం ఉదయం వరుసగా ప్రధాని మన్మోహన్ సింగ్ను, వాయలార్ రవిని, గులాం నబీ ఆజాద్ను కలిశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు.
తెలంగాణ నాయకులు గులాం నబీ ఆజాద్ను, సుశీల్ కుమార్ షిండేను, వాయలార్ రవిని కలిశారు. తెలంగాణ ఇస్తే 16 పార్లమెంటు సీట్లు, 80 శాసనసభ సీట్లు తెలంగాణ ప్రాంతంలో వస్తాయని తెలంగాణ నేతలు వాయలార్ రవితో చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకుల వాదనలను తాను అధిష్టానం ముందు ఉంచుతానని వాయలార్ రవి అన్నారు. సీమాంధ్ర నేతలపై గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
తెలంగాణపై ఈ నెల 25వ తేదీన గానీ 27వ తేదీన గానీ కేంద్రం ప్రకటన వెలువడవచ్చునని చెబుతున్నారు. నెలలోగా నిర్ణయం వెలువరించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు సుశీల్ కుమార్ షిండే ఒకటికి రెండు సార్లు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications