వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారికి డిపాజిట్లు గల్లంతే, జగన్ విజయం ఖాయం: రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
చిత్తూరు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్‌లు గల్లంతు కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా ఆదివారం అన్నారు. ఆమె చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ మైనార్టీలో పడినా బాబు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

ఓ పక్కా కిరణ్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటున్న చంద్రబాబు అవిశ్వాసం పెట్టేందుకు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందా? లేక కిరణ్ సర్కారును కాపాడుతున్నారా? చెప్పాలన్నారు. అవిశ్వాసం పెట్టకుండా ఉండటానికి ఆ రెండు కారణాలే అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జగన్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. సహకార ఎన్నికల్లో తామే ఎక్కువ స్థానాలు గెలుస్తామన్నారు.

సహకార రంగంలో దళితుల పట్ల కిరణ్ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గొల్ల బాబూరావు విశాఖపట్నంలో విమర్శించారు. సహకార రంగంలో నేటికీ రిజర్వేషన్ల విధానాన్ని ప్రభుత్వం అవలంభించకపోవడం దురదృష్టకరం అన్నారు. సహకార రంగంలో స్వామినాథన్ సిఫార్సులు మొట్టమొదట అమలు చేసిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయంలో నల్గొండ జిల్లా నేతలు సమావేశమయ్యారు. మరో మూడు రోజుల్లో షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారు జిల్లాలో షర్మిల పాదయాత్ర రూట్ మ్యాప్, ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు.

English summary
YSR Congress party senior leader Roja said that YS Jaganmohan Reddy will win in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X