రైలులో ఎమ్మెల్యే భార్యకే దిక్కులేదు, అసభ్యప్రవర్తన

సోమవారంలోగా నివేదిక సమర్పించాలని దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. కేంద్ర మాజీ మంత్రి మునిలాల్ కుమారుడైన శివేష్కుమార్ బీహార్లోని భోజ్పూర్ జిల్లా ఏజియాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే, తన భార్య, ఆరు నెలల చిన్నారి తో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన పాట్నా జంక్షన్లో దానాపూర్-హౌరా(సంపూర్ణ క్రాంతి) ఎక్స్ప్రెస్ ఎక్కారు.
శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్లో ఇదే కోచ్లోకి 17మంది రైల్వే టీటీఈలు, ఇతర సిబ్బంది ఎక్కారు. శివేష్కుమార్ దంపతుల ఎదురుగా ఉన్న బెర్త్లు ఎంపీ పేరిట రిజర్వ్ అయ్యాయి. అయితే, ఖాళీగా ఉన్న ఆ బెర్త్ల్లో రైల్వేసిబ్బంది కూర్చున్నారు. ఎమ్మెల్యే, ఆయన భార్యతో వారిలో కొందరు అమర్యాదగా ప్రవర్తించారు. బెంగాల్లో శిక్షణకు బయలుదేరిన వీరు బోగీలో తమ ఎదురుగా ఉన్న శివేష్ భార్య గురించి అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించారు. అలా చేయొద్దని ఎమ్మెల్యే భార్య కోరినా పట్టించుకోలేదు.
విధుల్లో టీటీఈ జితేంద్రసింగ్కు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో తాము ఎవరినీ ఇకపై ఇబ్బంది పెట్టబోమని రైల్వే సిబ్బంది హామీ ఇచ్చారు. కానీ, రైలు పాట్నా సాహెబ్ స్టేషన్ వచ్చేలోగా వీరంతా ఎమ్మెల్యే దంపతుల ఎదురుగానే మందు కొట్టడం ప్రారంభించారు. దీన్ని అడ్డుకున్న ఎమ్మెల్యేపై అల్లరిమూక దాడి చేసింది.
రైలు ఖుస్రూపూర్ స్టేషన్ వచ్చేటప్పటికి, హెల్ప్లైన్ హెచ్చరికలతో ఎమ్మెల్యే ఉన్న బోగీలోకి కొంతమంది పోలీసు సిబ్బంది వచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్న పంకజ్కుమార్ సిన్హా (ముజఫర్పూర్ టీటీఈ), సౌరవ్సింగ్(బుకింగ్ క్లర్క్, రాజేంద్ర నగర్)లను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. భక్తియార్పూర్ వద్ద అదనపు బలగాలను రప్పించి, గాలించినా ఫలితం లేకపోయింది.












Click it and Unblock the Notifications