జగన్ ఆస్తుల కేసు: మరో ఇద్దరు మంత్రులకు గండం

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరో ఇద్దరు మంత్రుల మెడకు చుట్టుకోనున్నదట. జగన్ ఆక్రమాస్తుల కేసులో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని ఆరుగురు మంత్రులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

జగన్ ఆస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసులో మోపిదేవి జైలులో ఉన్నారు. జగన్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ మరో ఇద్దరు మంత్రులతో ఈ నెలాఖరును మరో ఛార్జీషీట్ వేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ కేసులో సిబిఐ ఇప్పటికే పలు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడు దాఖలు చేసే ఛార్జీషీటులో మరో ఇద్దరు మంత్రుల పేర్లను ప్రస్తావించే అవకాశాలు ఉండటం గమనార్హం. జగన్ కేసులో మోపిదేవితో పాటు మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా ప్రస్తావించారు.

ధర్మాన అరెస్టుపై అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడైనా అరెస్టు కావొచ్చుననే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు మంత్రుల పేర్లు ఉండే అవకాశాలు ఉండటంతో రాజకీయంగా దుమారం రేగే అవకాశాలు ఉన్నాయి. సండూరు పవర్, భారతి, పెన్నా, ఇండియా, దాల్మియా సిమెంట్స్, ఇందూ ప్రాజెక్టు తదితర అంశాలపై సిబిఐ జగన్ కేసులో దర్యాఫ్తును కొనసాగిస్తోంది.

ఓఎంసి తరహాలో ఛార్జీషీట్లు

జగన్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించి జరిపిన విచారణలో అన్ని అంశాలను కలిపి ఒకే ఛార్జీషీటు దాఖలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు సిబిఐకి సూచించింది. అయితే ఇందులో వెసులుబాటు కూడా ఉంది. ఏదైనా ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాఫ్తు ఇంకా కొనసాగుతుందని పేర్కొనే పక్షంలో ఆ తర్వాత దర్యాఫ్తులో వెల్లడైన అంశాల ఆధారంగా మరో ఛార్జీషీటును దాఖలు చేసుకోవచ్చు. ఓఎంసి కేసులో మూడు ఛార్జీషీట్లు దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+