నిరూపిస్తారా: షర్మిల ఇష్యూపై గాలికి అంబటి సవాల్
కృష్ణా డెల్టాకు నీటి సరఫరా గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కర్ణాటక, మరాహాష్ట్రల నుంచి నీటిని రాబట్టడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కృష్ణానదిలో మునిగినా చంద్రబాబు పాపాలు ప్రక్షాళన కావని అంబటి రాంబాబు అన్నారు.
ప్రభుత్వం మైనారిటీలో పడినప్పుడు కాకుండా అంతా సర్దుకున్నాక అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తారా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెసుతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆయన విమర్శించారు కాంగ్రెసును తిట్టొద్దు, అవిశ్వాసం పెట్టమని తెలుగు తమ్ముళ్లే అడుగుతున్నారని ఆయన అన్నారు.
అవినీతిలో చంద్రబాబు నిష్ణాతుడని ఆనాడే ఎన్టీ రామారావు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆల్మట్టిపై మాట్లాడని చంద్రబాబు కృష్ణా డెల్టాపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకుని షర్మిల బుధవారంనాటి నుంచి తిరిగి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.