హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలకు ఆపరేషనే జరగలేదు, జగన్ కోసం..: గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు షర్మిలకు కాలికి శస్త్రచికిత్సనే జరగలేదని ఆయన అన్నారు. తొలుత కుడికాలికి దెబ్బ తగిలినట్లుగా చూపించారని, ఆ తర్వాత ఎడమ కాలికి దెబ్బ తగిలినట్లుగా చూపించారని ఆయన చెప్పారు. ఇందుకు సాక్ష్యంగా ఆయన రెండు ఫొటోలను మీడియా సమావేశంలో విడుదల చేశారు.

కుడికాలికి దెబ్బ తగిలిందని మొదట చూపించినవారు, జైలులో జగన్‌ను కలిసి తిరిగి వచ్చేటప్పుడు ఎడమ కాలికి దెబ్బ తగిలినట్లుగా చూపించారని ఆయన అన్నారు. షర్మిలకు శస్త్రచికిత్స జరిగిందనేది అంతా నాటకమేనని ఆయన అన్నారు. జగన్‌కరు బెయిల్ వస్తుందని భావించి దెబ్బ పేరుతో షర్మిల పాదయాత్రను హడావిడిగా ఆపించేశారని ఆయన అన్నారు.

వైయస్ జగన్‌కు బెయిల్ రాకపోవడంతో తిరిగి షర్మిల చేత పాదయాత్రను చేయిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ కుటుంబంలో ఆధిపత్య పోరు అప్పుడే ప్రారంభమైందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. షర్మిలకు నిజంగానే దెబ్బ తగిలి ఉంటే సాక్షి మీడియా పదే పదే చూపించి ఉండేదని, కానీ మౌనంగా ఉండిపోయిందని ఆయన అన్నారు. దీన్ని బట్టే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

షర్మిల తన పాదయాత్రను బుధవారం తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. షర్మిల డిసెంబర్ 15వ తేదీన తన పాదయాత్రను రంగారెడ్డి జిల్లాలో ఆపేశారు. కాలికి గాయం కావడంతో ఆమె అర్థాంతరంగా ఈ పాదయాత్రను నిలిపేశారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రిలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది.

English summary
Telugudesam leader Gali Muddukrishnama Naidu said that operation to YSR Congress leader Sharmila was a fake and she has not been operated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X