కారులో వచ్చి తండ్రిని కొట్టి ఎంబియే విద్యార్థిని కిడ్నాప్
శ్రీలత తన రికార్డులను కళాశాలలో సమర్పించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. శ్రీలతను కిడ్నాప్ చేసింది నరేందర్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. వడ్డేపల్లికి చెందిన అతను నిత్యం పెళ్లి చేసుకుంటానని తన కూతురు వెంటపడేవాడని తండ్రి ఆరోపించారు. అతని పైన అనుమానం ఉన్నట్లు తన ఫిర్యాదులో తండ్రి పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీలత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొండను ఢీకొన్న హెలికాప్టర్
విశాఖపట్నం జిల్లాలో ఓ హెలికాప్టర్ కొండను ఢీకొంది. జిల్లాలోని గాజువాక మండలం మునగాడ వద్ద నేవీకి చెందిన హెలికాప్టర్ కొండను ఢీకొంది.
దొంగల బీభత్సం
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఐదు తులాల బంగారం, ఆరు తులాల వెండిని, కొంత నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.