మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారులో వచ్చి తండ్రిని కొట్టి ఎంబియే విద్యార్థిని కిడ్నాప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilatha
హైదరాబాద్: తండ్రిని కొట్టి ఎంబియే చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేశారు. శ్రీలత అనే ఎంబియే విద్యార్థిని ప్రొఫెసర్ రాంరెడ్డి కళాశాలలో చదువుతోంది. ఆమె సోమవారం తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళుతుండగా మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి బైక్‌ను ఆపారు. దుండగులు శ్రీలత తండ్రి పైన దాడి చేసి ఆమెను ఎత్తుకుపోయారు. తనపై దాడి చేసి తన కూతురును కిడ్నాప్ చేశారని శ్రీలత తండ్రి బిడిఎల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

శ్రీలత తన రికార్డులను కళాశాలలో సమర్పించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. శ్రీలతను కిడ్నాప్ చేసింది నరేందర్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. వడ్డేపల్లికి చెందిన అతను నిత్యం పెళ్లి చేసుకుంటానని తన కూతురు వెంటపడేవాడని తండ్రి ఆరోపించారు. అతని పైన అనుమానం ఉన్నట్లు తన ఫిర్యాదులో తండ్రి పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీలత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కొండను ఢీకొన్న హెలికాప్టర్

విశాఖపట్నం జిల్లాలో ఓ హెలికాప్టర్ కొండను ఢీకొంది. జిల్లాలోని గాజువాక మండలం మునగాడ వద్ద నేవీకి చెందిన హెలికాప్టర్ కొండను ఢీకొంది.

దొంగల బీభత్సం

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఐదు తులాల బంగారం, ఆరు తులాల వెండిని, కొంత నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
An MBA student from pro.Ram Reddy college in Medak, Srilatha, who was on her way to college along with her father on scooter, was accosted by a youth who came in a car and was abducted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X