వీరప్పన్ అనుచరుల క్షమాభిక్ష తిరస్కరణ: ఉరే శిక్షే?
ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. తమకు క్షమాభిక్ష పెట్టాలని వారు 2004లో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసారు. వారి విజ్ఞప్తిని రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో పార్లమెంటు దాడి ఘటనలో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు తర్వాత వరుసలో వీరే ఉన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో ఈ నిందితులకు కింది కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే, వీరు దానిని తగ్గించాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ మరణ శిక్ష పడింది.
2004 నుంచి పలువురు రాష్ట్రపతులు వచ్చిపోయినా, ఇన్నాళ్లకు ఆయన ఈ ఫైల్ బూజు దులిపారు. రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కేసులో నలుగురు వీరప్పన్ అనుచరులు పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించి హోంశాఖకు తిప్పి పంపించారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాది బాలమురుగన్ మీడియాకు ద్రువీకరించారు.
2004 నుంచి వీరి క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. వీరి పిటిషన్లు తిరస్కరణకు గురైన విషయాన్ని జైలు అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తమ వారినీ ఉరి తీసేస్తారేమోనని కుటుంబ సభ్యు లు కలవరపడుతున్నారని మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు.