షర్మిలా! సమాధానమేది?యాత్రలో వైఎస్ కన్నేసి: బిజెపి
రాజన్న రాజ్యం అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కోవడం, దోచుకోవడం దాచుకోవడం, గిరిజనుల భూములను లాక్కోవడం, ఏడు కొండలను రెండు కొండలుగా చేయడం, గిరిజన భూములు లాక్కొని సమాధానం చెప్పక పోవడం.. ఇదే రాజన్న రాజ్యమా అని ఘాటుగా ప్రశ్నించారు. షర్మిల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ల ఆస్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)తో విచారణ జరిపించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. రక్షణ టివి పెట్టుబడులు నిగ్గు తేల్చాలన్నారు. గిరిజనుల భూములు లాక్కోవడంపై షర్మిల ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆస్తులపై తాము చేసిన ఆరోపణలకు షర్మిల ఎందుకు సమాధానం చెప్పడం లేదో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్, షర్మిలలపై తాము చేసిన ఆరోపణలు సరైనవి కాబట్టే వారు పెదవి విప్పడం లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కట్టబెట్టిన భూముల్లో ఇప్పటికీ సెజ్లు రాలేదన్నారు. పాదయాత్ర సమయంలో భూములను గుర్తించిన వైయస్ అధికారంలోకి రాగానే వాటిని సేకరించారని నిప్పులు చెరిగారు.
అగస్టా కుంభకోణం మూలాలు ఆంధ్రాలోనే
అగస్టా హెలికాప్టర్ కుంభకోణం మూలాలు ఆంధ్ర ప్రదేశ్లోనే ఉన్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గుంటూరు జిల్లాలో ఆరోపించారు. కేంద్రంలో లక్షల కోట్ల కుంభకోణం జరుగుతున్నాయన్నారు. సిబిఐ కాంగ్రెసు పార్టీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని కేంద్రం రక్షిస్తోందన్నారు. హిందూ టెర్రరిజం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను తాము నిలదీస్తామన్నారు.