ట్రాన్స్ట్రాయ్కే పోలవరం టెండర్లు: సిఎందే తుది నిర్ణయం

పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ నివేదిక తనకు ఇంకా అందలేదని ముఖ్యమంత్రి శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, పోలవరం టెండర్లపై సోమవారం ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ రెండు, మూడు రోజులు అధ్యయనం చేసింది. చివరకు ట్రన్స్ ట్రాయ్కే టెండర్లు కట్టబెట్టాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై వివాదాలు సృష్టించవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాజకీయ పార్టీలను కోరారు.
ఇదిలావుంటే, పోలవరం టెండర్లపై హైపవర్ కమిటీ నివేదిక తన వద్దకు రాలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి శనివారం అన్నారు. కమిటీ సిఫార్సులపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై అవసరమైతే తామే రాజకీయ పార్టీలతో మాట్లాడుతామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు మన రాష్ట్ర హక్కులను కూడా కాపాడిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత అవసరం అనుకుంటే బాబ్లీపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయాలకు వాడుకోవద్దని ఆయన రాజకీయ పార్టీలకు సూచించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications