జయప్రద కౌంటర్ జగన్కి కాదా?: మురళీ మోహన్పై సై!
ప్రస్తుతం వస్తున్నా మీకోసం పేరిట చంద్రబాబు నాయుడు, మరో ప్రజా ప్రస్థానం పేరిట జగన్ సోదరి షర్మిలలు పాదయాత్రలు చేస్తున్నారు. ఆమె పాదయాత్రలు రాజకీయ లబ్ధి కోసమేనని ఇప్పటికి రెండుసార్లు విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు షర్మిలకు కాకుండా బాబుకు మాత్రమే తగిలేలా ఉన్నాయని అంటున్నారు. పాదయాత్ర అని చెప్పినప్పటికీ పరోక్షంగా బాబునే ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
ఎందుకంటే ఆమె దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కితాబిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు మేలు జరిగిందని, ఆయన పాలనను ప్రజలు మనసుల్లో నుంచి వేరు చేయలేమని వ్యాఖ్యానించారు. తద్వారా ఆమె పాదయాత్ర కామెంట్స్ షర్మిలకు కాకుండా బాబుకు తగిలేలా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పైన పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. రాజమండ్రి నుండి టిడిపి తరఫున మురళీ మోహన్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు!
తెలంగాణ పైనా ఆమె ఇప్పటికి రెండుమూడు సార్లు స్పందించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సమైక్యాంధ్రకే తన మద్దతు అని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వలె తెలంగాణ విషయంలో ఆ భారాన్ని జయప్రద కూడా కేంద్రం పైనే మోపుతున్నారు.