RSS, BJP చీఫ్ ఏపీ కేంద్రంగా, కీలక మంత్రాంగం - మారుతున్న లెక్కలు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీ..ఆరెస్సెస్ అగ్ర నేతలు విశాఖలో మకాం వేసారు. కీలక మంత్రాంగం కొనసాగుతోంది. అటు పార్టీ.. ఇటు సంఘ్ సంస్థల మేధో మధనం మొదలైంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న ఈ సమావేశాల పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. దక్షిణాదిలో పట్టు పెంచుకునే దిశగా కొంత కాలంగా సాగుతున్న ప్రణాళికల్లో భాగంగా.. ఇప్పుడు జరుగుతున్న ఈ భేటీలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

మిషన్ 2029. అందులో భాగంగా ఢిల్లీ కొత్త కార్యచరణ అమలు చేస్తోంది. ఈ సారి అధికారం దక్కా లంటే దక్షిణాది లో పట్టు పెంచుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ముందస్తు వ్యూహా లను అమలు చేస్తోంది. బీజేపీ, ఆరెస్సెస్ అగ్ర నాయకత్వం విశాఖలో మకాం వేసింది. ఇప్పటికే బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ విశాఖలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇప్పుడు తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలోని 'విజ్ఞాన విహార్' పాఠశాలలో జరుగుతున్నాయి. చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్, గౌరవ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాళే తో పాటుగా సంఘ్ ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పంచ పరివర్తన్‌ అమలుపై కీలకంగా చర్చిస్తారు. సామాజిక, జాతీయ భద్రతా అంశాలపై సమీక్షించనున్నారు.

డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు..!!
డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు..!!
rss-all-india-coordination-meeting-commenced-at-visakhapatnam-32-organisations-inspired-by-the-sang

దక్షిణాది రాష్ట్రాల పై స్పెషల్ ఫోకస్

ఇక, విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ నితీన్ నబీన్ కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. ఆయన ఆరెస్సెస్ సమావేశాలకు హాజరు కానున్నారు. దక్షిణాదిలో.. ఏపీలోనూ పార్టీ బలోపేతం పైన పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. పొత్తులు.. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయంగా సూచించారు. స్థానిక సంస్థల్లో అవకాశం సద్వినియోగం చేసుకోవాలని.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ సొంతంగా ఎదిగే విధంగా ప్రణాళికలు అమలు చేయాలని సూచన చేసినట్లు తెలుస్తోంది. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక.. ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ అధినేతలు ఇద్దరూ విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న సమావేశాలు.. బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+