దంపతులపై దాడి, గోల్డ్ చోరీ: ప్రమాదంలో 4గురు మృతి

Nalgonda District
నల్గొండ/గుంటూరు/హైదరాబాద్/ విశాఖపట్నం: నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురంలో దొపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న దంపతులపై దుండగులు దాడి చేశారు. వారి నుంచి 5 కిలోల బంగారాన్ని అపహరించారు. దాడికి గురైన దంపతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

గంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రెండు లారీలు పరస్పరం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కాటేదాన్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. శోభాప్లాస్టిక్ కంపెనీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేయడానికి యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

విశాఖపట్నం జిల్లాలోని సీలేరు దగ్గర సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+