వేధింపులని ఫిర్యాదుచేస్తే.. యువతిపై పోలీసుల దాష్టీకం

విషయానికి వస్తే.. పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలో ఆధివారం ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న ఓ యువతిని ట్రక్కు డ్రైవర్లు వేధించారు. ఈ విషయమై ఆమె తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన వారి పైనే పోలీసులు లాఠీఛార్జ్ ఝులిపించడం వివాదాస్పదమయింది. నిందితుల నుండి లంచం తీసుకొని తనను, తన తండ్రిని పోలీసులు కొట్టారని ఆరోపించారు.
తన తండ్రిని పోలీసులు కొడుతుండగా తాను అడ్డు పడితే తనను కూడా కొట్టారని ఆమె ఆరోపించింది. పోలీసులు ట్రక్కు డ్రైవర్లను వెనుకేసుకు వచ్చి తండ్రీ కూతుళ్లను నడి వీధిలో చితకబాదిన సంఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. దీంతో పోలీసులు వ్యవహారం బయటకు వచ్చింది. ప్రభుత్వం వారిపై లాఠీఛార్జ్ ఝులుపించిన ఇద్దరు పోలీసులను సోమవారం నాడు సస్పెండు చేసింది.
ఈ ఘటనపై బాధిత యువతి స్పందిస్తూ.. తనపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం కాదని, ఉద్యోగంలో నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధిత మహిళ చెప్పింది. ఈ ఘటనపై ఎంపి జయబాచ్చన్ పార్లమెంటులో ప్రస్తావించారు. మీడియా రోజుకో కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకు వస్తుందని, సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications