హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందని లవర్‌పై బ్లేడుతో దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్/విశాఖపట్నం: తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందనే కోపంతో ఓ యువకుడు ప్రియురాలి పైన బ్లేడుతో దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్లలో ఇంటర్మీడియేట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉదయం పరీక్ష రాసేందుకు సెంటర్‌కు వెళుతుండగా సదరు యువకుడు ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. హాల్ టిక్కెట్ చించేశాడు.

ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయమయింది. ఆమె ఆ గాయంతోనే పరీక్షకు హాజరయింది. అయితే, ఆమెపై బ్లేడుతో దాడికి దిగిన అగంతకుడు ఆమెను ప్రేమించిన యువకుడే అని చెబుతున్నారు. ఆ విద్యార్థిని తమ మధ్య ఉన్న ప్రేమను తన తల్లిదండ్రులతో చెప్పిందని, అందుకే ఆమెపై అతడు దాడి చేశాడని చెబుతున్నారు.

గంజాయి పట్టివేత

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న అరవై నాలుగు కిలోల గంజాయిని జిఆర్‌పి పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి దార్యప్తు చేపట్టారు.

బ్యాంకులో చోరీ యత్నం

జిల్లాలోని గంట్యాడ మండలం బోనంగి గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీకి దుండగులు తీవ్రంగా యత్నించారు. బ్యాంకు తాళాలు పగుల గొట్టి చోరీకి యత్నించారు. గురువారం ఉదయం బ్యాంకు వచ్చిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

English summary
An intermediate girl student was attacked by youth while going to exams in Korutla of Karimnagar district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X