Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ కింగ్‌లమే, నేనుండగా..!: కిరణ్ రెడ్డి, కెసిఆర్‌పై టిజి

Kiran Kumar Reddy
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తామే మరోసారి గెలుస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని, 2014లోను తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎవరో ఒకరు భారం మోయాల్సిందే..

80 పైసలకు ఇస్తున్న విద్యుత్‌ను ప్రభుత్వం రూ.5కు కొంటోందన్నారు. ఇంకా అధిక భారం మేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు. ఎవరో ఒకరు భారం మోయాల్సిందే అన్నారు. అయినా, ప్రజల పైన ప్రభుత్వం అనవసర భారం వేయడం లేదన్నారు. విద్యుత్ శాఖను తాను సమీక్షిస్తున్నానని, ఇంకా ప్రత్యేక మంత్రి ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఏడు గంటల కంటే తక్కువ విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.

పెట్టుబడులపై...

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. గతంలో కేటాయించిన భూముల్లో నిర్దిష్ట సమయంలోగా పరిశ్రమలు ఏర్పాటు చేయని యాజమాన్యాల నుండి భూములు వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్నం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అక్కడ పెట్టుబడులకు ముందుకొస్తున్నారన్నారు.

రెండు టిఎంసిల కోసం పోరాడాలా?

బాబ్లీ ప్రాజెక్టుతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే రెండు టిఎంసిల నీటి కోసం పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో 160 టిఎంసిల నీటి కోసం ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలు ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు.

అసెంబ్లీలో సిటిజన్ చాఫ్టర్ అమలు బిల్లును త్వరలో ప్రవేశ పెడతామన్నారు. సరైన సేవలు అందించని అధికారులకు జరిమానా విధించేలా చట్టం తీసుకు వస్తామన్నారు.

తెరాస కాకి లెక్కలు

తెలంగాణ వెనుకబడిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాకి లెక్కలు చెబుతున్నారని మంత్రి టిజి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వెనుకబడిందని గారడి లెక్కలు చెప్పి యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా, సీమల కంటే తెలంగాణలోనే తలసరి ఆదాయం ఎక్కువ అన్నారు. యువతను పక్కదారి పట్టించే ప్రయత్నాలు సరికావన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే సడక్ బంద్ నిర్వహిస్తున్నారన్నారు. సడక్ బంద్ కారణంగా కర్నూలు-మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+