స్టాలిన్పై సిబిఐ: 18 ప్రాంతాల్లో సోదాలు, 17కార్లు సీజ్

స్టాలిన్ నివాసంలో సోదాల పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంతకముందు స్పందించిన విషయం తెలిసిందే. స్టాలిన్ నివాసంలో సిబిఐ ఈ సమయంలో సోదాలకు పూనుకోవడం దురదృష్టకరమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో అంతకుముందు అన్నారు. ఈ వార్త తెలిసి తాము ఆందోళనకు గురయ్యామన్నారు. ఇది చాలా విచారకరమన్నారు. సోదాల వెనుక ఎవరున్నారో ఆరా తీస్తామన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా స్టాలిన్ నివాసంలో సిబిఐ సోదాలను ఖండించిన విషయం తెలిసిందే. స్టాలిన్ నివాసంలో సోదాలు సరికాదన్నారు. ఇలాంటి సమయంలో సోదాలపై అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. సిబిఐ సోదాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఇది ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు తీసుకు వెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
కాగా, విదేశీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ స్టాలిన్ నివాసంలో సోదాలు జరిపింది. గురువారం తెల్లవారుజాము నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రారంభించింది. డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి బంధువుల ఇళ్లల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. అనంతరం విమర్శలు రావడంతో ఆపేశారు.












Click it and Unblock the Notifications