నీ ఇలాకాలో సిద్ధమా?: కిరణ్ రెడ్డికి విజయమ్మ సవాల్

ఒక్క ఎకరం కూడా పంట ఎండిపోలేదని కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో చాలా పంట ఎండిపోయిందనే విషయం ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఈ పోరాటాన్ని తాము ముఖ్యమంత్రి నియోజకవర్గం నుండే ప్రారంభిస్తామని చెప్పారు. అప్పుడు ఎన్ని ఎకరాలు ఎండిపోయాయో తెలుస్తుందన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఇందిరాపార్క్ వద్ద నిరవధిక దీక్ష చేస్తోంది. వారి దీక్షకు విజయమ్మ సోమవారం సంఘీభావం తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, కమ్యూనిస్టులు కలిసి ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తాము వామపక్షాలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమే అన్నారు.
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద వామపక్ష నేతల దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. వారికి పలు రాజకీయ పార్టీలు, నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ రోజు టిడిపి ఎమ్మెల్యేలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు కూడా సంఘీభావాన్ని తెలిపింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications