జగన్ తప్పు చేయకుంటే బెయిల్ ఎందుకు రాదు: బాబు
తూర్పుగోదావరి జిల్లా సా మర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద మంగళవా రం ఆయన పాదయాత్ర నిర్వహించారు. తిమ్మాపురం, పండూరు జంక్షన్, డీ వెంకటాపురం, తండ్రవాడ, పవరా జంక్షన్..చిత్రాడ, పిఠాపురం రూరల్ పోలీస్స్టేషన్ వరకు నడక సాగించారు. దారిలో కలిసిన మత్స్యకారులు, కూలీలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారి కష్టాలు ఆరాతీస్తూ ముందుకు సాగారు.
ఒక పేదవాడు నాలుగు మామిడిపళ్లు దొంగతనం చేస్తేనే సమాజం నిందిస్తుందని అంటూ అలాంటిది లక్ష కోట్లు దోచుకున్న వైయస్ రాజశేఖర రెడ్డిని, ఆయన కుమారుడిని మీరు క్షమిస్తారా? వారికి ఏ శిక్ష వేస్తే మీకు న్యా యం జరుగుతుందని ఆయన అడిగారు. శ్రీలక్ష్మి మంచి అధికారి అని, ఆమె తన హయాంలో బాగా పనిచేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. వైయస్ ధన దాహానికి ఆమె జైలు పాలు కావాల్సి వచ్చిందన్నారు.
ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాల్సిన వారే దొంగలుగా మారుతున్నారని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు రాక్షస పాలన సాగిందని, ఇప్పటివరకు నలభై వేల కోట్ల మేర వివిధ రూ పాల్లో విద్యుత్ సర్చార్జీ విధించారని విమర్శించారు.
అంతకుముందు.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్సే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంచివారికీ, సమర్థులకీ అవకాశం కల్పిస్తామన్నారు.