టిటిడిపిలో ముసలం: మోత్కుపల్లి చీడపురుగని కడియం

Mothkupalli Narasimhulu - Kadiyam Srihari
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో విబేధాలు ముదురుతున్నాయి. టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పైన మరో నేత కడియం శ్రీహరి పరోక్షంగా ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న తనపై ఒక తెలంగాణ నేత ఆరోపణలు చేయడం సమంజసం కాదని పరోక్షంగా మోత్కుపల్లిని ఉద్దేశించి అన్నారు.

ఈ నెల 19న జరిగిన టిడిపి ఫోరం అంతర్గత సమావేశంలో పార్టీ పటిష్టత కోసం తెలంగాణ ఉద్యమంపై తాను సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై తాను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశానని, పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించాననే వార్తలు పత్రికల్లో మరుసటి రోజు రావడం పట్ల తానేదో తప్పు చేసినట్లు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. తనపై ఆరోపణలు చేసిన నేత ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కడియం డిమాండ్ చేశారు.

అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీలో మనుగడ సాగిస్తున్న చీడ పురుగులెవరో కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు తెలుసునని కడియం ధ్వజమెత్తారు. పార్టీని వీడి మళ్లీ పార్టీలోకి వచ్చిన సదరు నేతలకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. పార్టీలో తెలంగాణ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, ఈ కోల్డ్ వార్ తెలంగాణ ప్రాంత నేతల మధ్య కొనసాగడం దురదృష్టకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+