తండ్రీ కొడుకులు కలిసి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

Father and Son molest 8 yr old
చిత్తూరు/మహబూబ్‌నగర్: ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ తండ్రి, అతని కొడుకు అత్యాచారం చేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి మండలం ఎగువ వీధికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై తండ్రి, కొడుకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక వయస్సు కేవలం ఎనిమిదేళ్లు. ఆమె నాలుగో తరగతి చదువుతోంది. సాయంత్రం సమయంలో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంటుండగా దాహం వేయడంతో పక్కనే ఉన్న చిన్నాన్న ఇంట్లోకి వెళ్లి నీళ్లు తాగి రమ్మని స్నేహితురాలు చెప్పింది.

అక్కడకు వెళ్లిన బాలిక నోట్లో గుడ్డలు కుక్కి తండ్రి గోపాలయ్య, కొడుకు ఈశ్వరయ్యలు అత్యాచారనికి పాల్పడ్డారు. బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పరారీలో ఉన్నారు.

వేధింపులతో మహిళ ఆత్మహత్య

మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దమందడి మండల ఠాణాలో ఆదివారం నిర్భయ కేసు నమోదైంది. బాధితురాలి మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. జగత్పల్లి గ్రామానికి చెందిన రాధను అదే గ్రామానికి చెందిన అజయ్ కుమార్ వారం రోజులుగా లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఓ రోజు ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+