అనుమతి అవసరం లేదు: ధర్మానపై సిబిఐ

రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు నిబంధనలను ఉల్లంఘించారని సిబిఐ తరఫు న్యాయవాది అశోక్ భాను ఆరోపించరాు. వాన్పిక్ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని, ఆ సంస్థకు భూములు కేటాయించడంలో ధర్మాన పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ధర్మాన ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఆయన వాదించారు.
వాన్పిక్కు అనుకూలంగా ధర్మాన ప్రసాద రావు 2004 - 2009 మధ్య కాలంలో వ్యవహరించారని, భూములను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని ఆయన అన్నారు. శాసనసభకు బాధ్యతగా ఉండాల్సిన మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ న్యాయవాది అన్నారు.
సిబిఐ న్యాయవాది వాదనలను కొట్టేయడానికి ధర్మాన ప్రసాద రావు తరఫు న్యాయవాది ప్రయత్నించారు. మంత్రివర్గం ఆమోదంతోనే జీవోలు జారీ అయ్యాయని ఆయన అన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద ప్రభుత్వ అనుమతి లేకుండా ధర్మానను ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్కు భూములు కట్టబెట్టడంలో అక్రమాలు జరిగాయని అభియోగాలు మోపుతూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో ధర్మానను సిబిఐ ఐదో నిందితుడిగా చేర్చింది. ప్రస్తుతం రోడ్లు భవనాల మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications