న్యూఢిల్లీ: ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలోని జంక్యార్డ్ వద్ద గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు.
టీవీ రిపోర్టుల ప్రకారం - ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో గల మొఘల్ షెరటాన్ హోటల్ వెనక గల జంక్ యార్డులో ఈ పేలుడు సంభవించింది. సంఘటనా స్థలం ఆగ్రాకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వివరాలు అందాల్సి ఉంది.