కన్నడ మంత్రులు మా జైలుకు: కిరణ్, రఘువీరా హిట్
అవినీతి బిజెపిని ఓడించాలని, సుపరిపాలన కోసం కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పేదల పెన్నిధి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాలకూ మేలు చేసే పథకాలెన్నో అమలు చేస్తున్నదంటూ ఆ జాబితా మొత్తం ప్రకటించారు. అంతేకాకుండా పథకాల అమలులో లోటుపాట్లను గుర్తించేందుకు స్వయంగా ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నానని వివరించారు.
బిజెపి అవినీతి వల్ల అభివృద్ధి స్తంభించిందని చెప్పారు. ఎస్ఎం కృష్ణ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు నేటికీ స్మరించుకుంటున్నారన్నారు. మరోసారి బిజెపికి ఓట్లు వేయడమంటే వినాశనానికి స్వాగతం పలకడమేనని హెచ్చరించారు. బెంగళూరు మహానగరం మురికికూపంగా తయారైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కళాకాంతులు తెస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు ఆయనకు కాంగ్రెస్ అభ్యర్థులు ఘన స్వాగతం పలికారు. ఆయనతోపాటు మంత్రులు రఘువీరారెడ్డి, టిజి వెంకటేశ్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు గంగా భవాని తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కిరణ్ సభకు హాజరైన అనేకమందికి తెలుగు తెలియకపోవడం వల్ల ఆయన ప్రసంగానికి వారినుంచి స్పందన అంతగా కానరాలేదు. అయితే, రఘువీరా రెడ్డి కొద్దిసేపు కన్నడ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు.