వైఎస్ చెప్పినట్లే వినాలి, స్వేచ్ఛలేని మంత్రులు: సారయ్య

పార్టీకి సేవ చేస్తా: ధర్మాన
మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ... తాను అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పారు. పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. మంగళవారం ధర్మాన పుట్టిన రోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తద్వారా ఆయన బల ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రేపు ఆయన తన రాజకీయ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మరోవైపు రాజీనామా చేసిన ధర్మాన, సబితలకు పలువురు మంత్రులు సంఘీభావం తెలుపుతున్నారు. ధర్మానను మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రఘువీరా రెడ్డి, సబితా రెడ్డిని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్ తదితరులు కలిశారు. కాగా తాను గవర్నర్ను మర్యాద పూర్వకంగానే కలిశానని డి శ్రీనివాస్ చెప్పారు. మంత్రుల రాజీనామాపై కామెంట్ చేసేందుకు ఆయన ఇష్టపడలేదు. అయితే డిఎస్, బొత్సలు గవర్నర్ను కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పార్థసారథిపై దేవినేని ఉమ ఫైర్
అక్రమాలకు పాల్పడ్డ మంత్రి పార్థసారథిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications