కెసిఆర్‌పై తలసాని ఫైర్: మేం క్లియర్: యనమల

Yanamala Ramakrishnudu and Talasani Srinivas Yadav
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ తన భాషను మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలో ఓటర్లు ఉచ్చ కూడా పోయరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తలసాని తీవ్రంగా ప్రతిస్పందిచారు. తమ పార్టీ డివిజన్ స్థాయి నాయకులు కూడా కెసిఆర్ కన్నా పరుషంగా మాట్లాడగలరని ఆయన అన్నారు.

కెసిఆర్ హుందాగా వ్యవహరిస్తే మంచిదని తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. కెసిఆర్ కన్నా వందరెట్లు తాము బాగా మాట్లాడగలమన్నారు. చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడితే సంహించమని, కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని తలసాని హెచ్చరించారు.

ఇదిలావుంటే, తెలంగాణపై తమ పార్టీ స్పష్టత ఇవ్వలేదనే విమర్శలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. తెలంగాణపై తాము స్పష్టత ఇచ్చామని, అయినా కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆనయ అయన అన్నారు. మహానాడులో ప్రతిపాదించే రాజకీయ తీర్మానంలో తెలంగాణ ప్రదానాంశంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు జరిగే మహానాడు ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు.

గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్‌లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను శనివారం 16 కమిటీల నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంతో పాటు కళంకిత మంత్రుల తొలగింపు, విలువలతో కూడిన రాజకీయాలపై చర్చ ఉంటాయని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీ కోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను తీర్మానాల రూపేణ చర్చించి ఆమోదిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+