చిరు అవమానించారు, జగన్కు తీహార్ రెడీ: నామా

దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలు ఉండడం వల్లనే నల్లధనం జాబితా బయటపెట్టడం లేదని అన్నారు. నల్లధనంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటును స్తంభింపజేశామని చెప్పుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్ల రూపాయలకు మించి ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టాలనే దుర్పుద్ధితోనే పెట్టిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసు అని అన్నారు. ప్రజాధనాన్ని కాజేసి పార్టీ పెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చంద్రబాబుపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణపై స్పష్టత ఉందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంంగా 2008లో చేసిన తీర్మానాన్ని తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. అఖిలపక్ష సమావేశం తెలంగాణపై పెట్టాలని తామే డిమాండ్ చేశామని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రాకవసరమని అన్నారు.
కేంద్రంలో సంకీర్ణానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. 2014లో అన్ని శక్తులను కూడదీసి శక్తి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే ఉందని చెప్పారు. కేంద్రంలో బిజెపి, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని అన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications