జగన్కు ఝలక్ ఇచ్చేనా?: కాంగ్రెస్తో బోడ మంతనాలు

పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్, మాజీ మంత్రి వినోద్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బోడ జనార్ధన్కు కాంగ్రెసు పార్టీ గాలం వేస్తోంది. ఆయనతో కొద్ది రోజులుగా చర్చలు జరుపుతోంది. వివేక్, వినోద్లు తెరాసలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమైంది. దీంతో బోడను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ఆ ప్రాంత టి కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ... తనతో కాంగ్రెసు నేతలు మాట్లాడుతున్నది వాస్తవమే అన్నారు. వివేక్, వినోద్లు కాంగ్రెసు పార్టీని వీడుతున్న నేపథ్యంలో తనకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన చెప్పారు.
కాగా, బోడ జనార్ధన్ తెలుగుదేశం పార్టీ నుండి సంవత్సరంన్నర క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కడపలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెసు నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications