ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు ఝలక్ ఇచ్చేనా?: కాంగ్రెస్‌తో బోడ మంతనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Boda Janardhan
హైదరాబాద్: మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అదిలాబాద్ జిల్లా నేత బోడ జనార్ధన్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బోడ జనార్ధన్‌కు కాంగ్రెసు పార్టీ గాలం వేస్తోంది. ఆయనతో కొద్ది రోజులుగా చర్చలు జరుపుతోంది. వివేక్, వినోద్‌లు తెరాసలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమైంది. దీంతో బోడను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ఆ ప్రాంత టి కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిపై ఆయన స్పందిస్తూ... తనతో కాంగ్రెసు నేతలు మాట్లాడుతున్నది వాస్తవమే అన్నారు. వివేక్, వినోద్‌లు కాంగ్రెసు పార్టీని వీడుతున్న నేపథ్యంలో తనకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన చెప్పారు.

కాగా, బోడ జనార్ధన్ తెలుగుదేశం పార్టీ నుండి సంవత్సరంన్నర క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కడపలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెసు నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

English summary

 Congress Party keen on YSR Congress Party leader Boda Janardhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X