బిజెపి గెలిచేది ఒక్క సికింద్రాబాద్ సీట్లోనే: రాములమ్మ
కోయిల గుంపులోకి వచ్చా: కడియం
పార్టీలోకి కడియం శ్రీహరి చేరిన సందర్భంగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన అభినందన సభలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొన్నారు. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా 13 ఏళ్ల క్రితం తెరాస ఆవిర్భవించినందువల్లనే నాగంతో పాటు టిడిపి, కాంగ్రెస్, బిజెపిలు ప్రత్యేక రాష్ట్ర జపం చేస్తున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. కాకుల గుంపు నుండి కోయిల గుంపులోకి వచ్చినట్లుగా ఉందని, తన మనుషుల మధ్య ఉన్నట్లుగా ఉందన్నారు. ఐదారేళ్లు తపనకు గురై ప్రజల్లోకి వెళ్లాలని, తెలంగాణ సాధించుకోవాలని తెరాసలోకి వచ్చానని చెప్పారు. టిడిపిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేశామని, అందుకు పాప పరిహారం చేసుకోవడానికే తెరాసలోకి వచ్చానన్నారు.
కడియం శ్రీహరి కంటే తన గుండెలో ఎక్కువ బాధ ఉందని, ఆయనలాగా బయటకు చెప్పుకోలేనన్నారు. సోనియా గాంధీతోను మాట్లాడానని, తనకు అన్ని పదవులు ఇచ్చామని ఆమె చెబితే తెలంగాణ ఇవ్వలేదని చెప్పానన్నారు. సహనానికి ఓ హద్దు ఉంటుందన్నారు.