... ఐతే నేను నెంబర్ 3: చౌహాన్, మోడీపై బెల్జియం ప్రేమ
అద్వానీ వ్యాఖ్యలకు విపరీతార్థాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ముఖ్యమంత్రులందరినీ ప్రశంసించారని, ఏ ఒక్కరినీ విమర్శించలేదని స్పష్టం చేశారు. పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి తాను పోటీలో లేనని పరోక్షంగా వెల్లడించారు. పార్టీలో నరేంద్ర మోడీ, రమణ్ సింగ్ల తర్వాతే తానని స్పష్టం చేశారు.
వారిద్దరు తనకంటే సీనియర్లని, పెద్దన్నలాంటి వారన్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన గుజరాత్ను మోడీ మరింత ముందుకు తీసుకెళ్లారని, అదే వెనకబడి ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లను చౌహాన్, రమణ్ సింగ్లు ఎంతో అభివృద్ధి చేశారని, మోడీ కంటే వారిద్దరూ సీనియర్లని అద్వానీ వ్యాఖ్యానించిన దానిపై వివాదం చెలరేగింది. అద్వానీ వ్యాఖ్యలపై రాజ్ నాథ్ సింగ్ కూడా స్పందించారు. అద్వానీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.
బెల్జియంకు మోడీపే ప్రేమ
గోద్రా ఘటన అనంతరం మోడీపే గుర్రుగా ఉన్న యూరోప్ దేశాలు ఇప్పుడు బెట్టు వీడి ఆయన జపం చేస్తున్నాయి. బ్రిటన్, జర్మనీ తర్వాత ఇప్పుడు బెల్జియం మోడీని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతోంది. ముంబైలో బెల్జియం కాన్సుల్ జనరల్ సోమవారం మోడీని ప్రశంసల్లో ముంచారు.
అహ్మదాబాదులో బెల్జియం వీసా కేంద్రాన్ని ఆయన ప్రారంభంచారు. గుజరాత్తో వాణిజ్య సంబంధాలపై మోడీతో చర్చించేందుకు తామెంతో సానుకూలంగా ఉన్నామని, యూరోప్ దేశాల్లో పర్యటించేందుకు ప్రతి ఒక్కరు ఆహ్వానితులేనని మోడీని ఉద్దేశించి అన్నారు.