ఈసికి జగన్ వర్గం లేఖ: ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన బాబు

ఎన్నికల గడువు మరో ఏడాది ఉన్నందున తమ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధుల అవసరం ఉందని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏవి, ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలు జరపాలని చంద్రబాబు, కిరణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఎన్నికల సంఘానికి లేఖలు రాయాలని సవాల్ విసిరారు. స్వార్థ రాజకీయానికి స్పీకర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారన్నారు.
ఎమ్మెల్యేలపై బాబు ఫైర్
అసెంబ్లీ నడుస్తున్న తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని పదే పదే వాయిదా వేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీరు మునిగేందుకు సిద్ధంగా ఉన్నా.. తాను మాత్రం లేనని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా స్పందించడం లేదన్నారు. అసెంబ్లీలో మూడు గంటలు కూడా ఉండలేని వారు ప్రజా సమస్యలు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications