ఆస్తి కోసం ప్లాన్ వేసి తల్లిదండ్రులను చంపిన కసాయిలు

దర్యాఫ్తులో కొడుకులే వారిని హత్య చేసినట్లుగా తేలింది. ఆస్తికోసం హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. తల్లిదండ్రుల వద్ద స్థిరాస్థితో పాటు అధిక మొత్తంలో నగదు ఉంది. దీనిని గుర్తించిన ఇద్దరు కొడుకులు రవీంద్ర, వీరేంద్రలు దానిని తమకు పంచాలని ఒత్తిడి చేశారు. తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో వారు హత్య చేసి ఆస్తి పంచుకోవాలని ప్లాన్ చేశారు.
హైదరాబాదులో ఓ గొడవ ఉందని చెప్పిన వీరేంద్ర, రవీంద్ర వారిని ఓ కారులో తీసుకు వచ్చి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పంటపొలాల్లో పడేశారు. ఈ కేసుకు సంబంధించి రవీంద్ర, వీరేంద్రలతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
రైతులకు గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేట శివారులోని పొలాల్లో అమర్చిన మందుగుండు సామాగ్రి పేలి ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications