పప్పీ ఎఫెక్ట్: బిఎస్పీ ఎంపీ సస్పెండ్, బిజెపి నేత రిజైన్
నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లపై మాట్లాడుతూ చేసిన పప్పీ వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసింది. మోడీ వ్యాఖ్యలపై విజయ్ ఇటీవల స్పందిస్తూ... మోడీ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనని అన్నారు. విజయ్ వ్యాఖ్యలపై బిఎస్పీ మండిపడింది. ఈ రోజు ఆయనను బహిష్కరించింది.
ఢిల్లీలో రాజీనామా
మరోవైపు మోడీ వ్యాఖ్యల పైన అభ్యంతరం తెలిపిన ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు అమీర్ రాజా హుస్సేన్ తన పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. ఆయన ఇటీవల మోడీ పప్పీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసి, అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ముస్లింలు మోడీ కన్నా పార్టీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ను ప్రధాని అభ్యర్థిగా ఇష్టపడతారని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. దాంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశ్యం కాదని, తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఈ రోజు ప్రకటించారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు.