పంచాయతీ: హరికృష్ణ థ్యాంక్స్, మైసూరా శుభాకాంక్షలు

Nandamuri Harikrishna - Mysoora Reddy
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం అన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

మైసూరా కృతజ్ఞతలు

పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన తమ పార్టీ మద్దతుదారులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారో తెలుసుకొని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే బాగుంటుందన్నారు.

ఎన్నికైన వారు ఏ పార్టీకి చెందిన వారో విచారించి ప్రకటించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తే తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరికి వారు తమ ఇష్టమొచ్చినట్లుగా ప్రకటిస్తున్నారన్నారు. ఎవరు ఏ విధంగా ప్రచారం చేసుకున్న ప్రజల అభిమానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైనే ఉందన్నారు.

కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండువేల ఆరు వందల గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, తెరాసలు మద్దతిచ్చిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+