వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్సకు అంతా తెలుసు, పులి బోన్లోనే: షర్మిలకు విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 V Hanumantha Rao and Sharmila
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గురించి బాగా తెలుసునని, ఆయన చేతిలో చాలా బాణాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శుక్రవారం అన్నారు.

మూడు వందల అరవై రోజులలో వైయస్ ఏనాడైనా మందు తాగలేదని చెప్పగలరా? అని బొత్స గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విహెచ్ మాట్లాడారు. వైయస్ గురించి బొత్సకు బాగా తెలుసన్నారు. ఆయన ఇప్పటి వరకు ఒకటే బాణం వదిలారని, ఇంకా చాలా బాణాలు ఉన్నాయన్నారు.

అందరికీ అవకాశాలు రావని, కాంగ్రెసు పార్టీలో వైయస్‌కు అవకాశం వచ్చిందని, తమకు రాలేదు అంతే అన్నారు. వైయస్ కష్టంతో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడిందనేది సరికాదన్నారు. అదే నిజమైతే 2004 కంటే 2009 సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. గత ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ 156 సీట్లలో మాత్రమే గెలిచిందన్నారు.

తన సోదరుడు పులి అని, అలాంటి పులిని జైలులో పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల అంటుంటారని, పులి బయట బయటి కంటే బోనులో ఉంటేనే మంచిదన్నారు. జగన్ బయటకు వస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడని ఆరోపించారు.

English summary
Congress party senior leader V Hanumantha Rao said on Friday that PCC cheif Botsa Satyanarayana know all about YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X