వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు వాస్తవం తెలుస్తోంది: వైయస్, బొత్సలపై వర్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Varla Ramaiah
హైదరాబాద్: గాంధీ వారసులమని చెప్పుకుంటూ మద్యం తాగకుండా ఏడాదిలో ఒక్కరోజు కూడా గడపని వ్యక్తులు కొందరైతే, తెల్ల టోపీ, ఖద్దరు దూస్తులు ధరిస్తూ బ్రాందీ వారసుల్లాగా గడుపుతున్న వ్యక్తులు మరికొందరని, ఇప్పుడు వాస్తవాలు బయటకొస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం మండిపడ్డారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం డాన్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల ఆరోపించగా.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బ్రాందీ తాగకుండా ఉన్నాడా అని బొత్స గురువారం అన్న విషయం తెలిసిందే. దీనిపై వర్ల మాట్లాడారు.

వైయస్ బతికున్న రోజుల్లో ఒకరి తప్పును మరొకరు కాపాడుకుంటూ వచ్చారని, ఇప్పుడు బొత్స విమర్శలతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. విభేదాలు చోటుచేసుకోనంతవరకూ వైయస్, బొత్స చేసిన అక్రమాలు, దోపిడీల్లో ఇరుకుటుంబాలూ భాగస్వాములయ్యాయని ఆరోపించారు.

వైయస్ అల్లుడు అనిల్ కుమార్ చేసిన తప్పులు, దోపిడీల గురించి ఇప్పటికైనా వెల్లడించాలని బొత్సను, తన తప్పులు, అక్రమాలను బొత్స ఎలా కప్పిపుచ్చారో చెప్పాలని అనిల్ కుమార్‌ను డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రాన్ని మరెంతగా దోపిడీ చేసేవారోనని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం గనులను వైయస్ తన అల్లుడు అనిల్‌కు కట్టబెట్టినప్పుడు బొత్స ఎందుకు మాట్లాడలేదన్నారు.

English summary
Telugudesam Party senior leader Varla Ramaiah said that the facts of Congress party is revealing now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X