ఇప్పుడు వాస్తవం తెలుస్తోంది: వైయస్, బొత్సలపై వర్ల
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం డాన్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల ఆరోపించగా.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బ్రాందీ తాగకుండా ఉన్నాడా అని బొత్స గురువారం అన్న విషయం తెలిసిందే. దీనిపై వర్ల మాట్లాడారు.
వైయస్ బతికున్న రోజుల్లో ఒకరి తప్పును మరొకరు కాపాడుకుంటూ వచ్చారని, ఇప్పుడు బొత్స విమర్శలతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. విభేదాలు చోటుచేసుకోనంతవరకూ వైయస్, బొత్స చేసిన అక్రమాలు, దోపిడీల్లో ఇరుకుటుంబాలూ భాగస్వాములయ్యాయని ఆరోపించారు.
వైయస్ అల్లుడు అనిల్ కుమార్ చేసిన తప్పులు, దోపిడీల గురించి ఇప్పటికైనా వెల్లడించాలని బొత్సను, తన తప్పులు, అక్రమాలను బొత్స ఎలా కప్పిపుచ్చారో చెప్పాలని అనిల్ కుమార్ను డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రాన్ని మరెంతగా దోపిడీ చేసేవారోనని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం గనులను వైయస్ తన అల్లుడు అనిల్కు కట్టబెట్టినప్పుడు బొత్స ఎందుకు మాట్లాడలేదన్నారు.