కేదార్నాథ్ గుడి రీబిల్డింగ్: మోడీని కాదన్న చౌహాన్
భోపాల్: కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విభేదించారు. మెరుపు వరదలకు ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణం గురించి ఆలోచించే సమయం ఇది కాదని చౌహాన్ అన్నారు. దానిపై చర్చించే సమయం కాదని ఆయన అన్నారు.
కేదార్నాథ్ ఆలయం పునర్నిర్మాణంపై తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ పనిని చూసుకుంటుందని ఆయన అన్నారు. హరిద్వార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సాధువులు, ఆచార్యుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మిస్తుందని ఆయన చెప్పారు.

ఉత్తరాఖండ్లో జరిగిన ప్రకృతి వైపరీత్యం భారీగా ఉందని, దాని ప్రభావాన్ని తగ్గించడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆలయాన్ని పునర్నిర్మించడానికి మోడీ ముందుకు వచ్చారు. అయితే, అందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ ఆ పని చేపడతాయని ఆయన చెప్పారు.
నరేంద్ర మోడీతో బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా విభేదించారు. కేదార్నాథ్ ఆలయం హిందువుల విశ్వాసానికి సంబంధించిందని, హిందూ సమాజం, హిందూ మత విశ్వాసకులు ఆలయాన్ని పునర్నిర్మించే విషయాన్ని చూసుకుంటారని ఆయన అన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications