కేదార్నాథ్ గుడి రీబిల్డింగ్: మోడీని కాదన్న చౌహాన్
భోపాల్: కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విభేదించారు. మెరుపు వరదలకు ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణం గురించి ఆలోచించే సమయం ఇది కాదని చౌహాన్ అన్నారు. దానిపై చర్చించే సమయం కాదని ఆయన అన్నారు.
కేదార్నాథ్ ఆలయం పునర్నిర్మాణంపై తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ పనిని చూసుకుంటుందని ఆయన అన్నారు. హరిద్వార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సాధువులు, ఆచార్యుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మిస్తుందని ఆయన చెప్పారు.

ఉత్తరాఖండ్లో జరిగిన ప్రకృతి వైపరీత్యం భారీగా ఉందని, దాని ప్రభావాన్ని తగ్గించడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆలయాన్ని పునర్నిర్మించడానికి మోడీ ముందుకు వచ్చారు. అయితే, అందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ ఆ పని చేపడతాయని ఆయన చెప్పారు.
నరేంద్ర మోడీతో బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా విభేదించారు. కేదార్నాథ్ ఆలయం హిందువుల విశ్వాసానికి సంబంధించిందని, హిందూ సమాజం, హిందూ మత విశ్వాసకులు ఆలయాన్ని పునర్నిర్మించే విషయాన్ని చూసుకుంటారని ఆయన అన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications