వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన సెగ: సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం కారణంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ఆయనకు సూచించారు. దీంతో ఆయన రేపు మంగళవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆయన రేపు ఆంటోనీ కమిటీని కలిసే అవకాశాలున్నాయి.

విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో గత 19 రోజులుగా ఉద్యమాలు సాగుతున్నాయి. ఎపి ఎన్జీవోలు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ స్థితిలో తాజా పరిణామాలపై చర్చించేందుకు కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి అహ్వానించినట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి 8 గంటలకు తెలంగాణ నేతలు ఆంటోనీ కలుస్తున్నారు. అదే సమయంలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు రేపు మంగళవారం ఆంటోనీ కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏక వాక్య తీర్మానం చేసిన వారు ఆంటోనీ కమిటీకి దాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. సిడబ్ల్యుసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సీమాంధ్రలో ఉద్యమాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. దానికితోడు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు హైదరాబాదుపై పట్టుబట్టి కూర్చున్నట్లు తెలుస్తోంది. విభజన అనివార్యమైతే హైదరాబాదును కేంద్ర పాలితం ప్రాంతంగా చేయాలని కేంద్ర మంత్రి సాంబశివ రావు తాజాగా డిమాండ్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

English summary
Congress high command has invited CM Kiran kumar Reddy to discuss about the situation prevailed in Andhra Pradesh in wake of Andhra Pradesh bifurcation decission taken bt CWC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X