బానిసలం కాదు: మహీధర్, రాసిస్తే పరిశీలిస్తామని డిగ్గీ

రాసిస్తే పరిశీలిస్తామన్న డిగ్గీ
రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిపై ఈ నెల 30లోగా తేల్చాలని అధిష్ఠానానికి అల్టిమేటమ్ ఇవ్వాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన 9 మంది కేంద్ర మంత్రులు పార్లమెంట్ అనుబంధ భవనంలో సోమవారం భేటీ అయ్యి, పరిస్థితిని సమీక్షించారు. ఆంటోనీ కమిటీ సభ్యులు వారితో మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బుధవారం తర్వాతే వారిని కలుసుకోవాలని మంత్రులు నిర్ణయించారు.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని వారు నిర్ణయించారు. హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి, తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు రాజధానులు ఏర్పాటుచేయాలన్న కావూరి నిర్ణయం సహేతుకంగా ఉన్నదని, దీని వల్ల ఎవరికీ నష్టం జరగదని వారు భావించారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఎక్కువకాలం సాగకుండా 30 లోగా నిర్ణయం తీసుకోవాలని కోరాలని వారు నిర్ణయించుకున్నారు.
కాగా, మంత్రుల అల్టిమేటమ్ తమకు చేరలేదని, వారు లిఖితపూర్వకంగా తమకు ఏమైనా ఇస్తే పరిశీలిస్తామని దిగ్విజయ్ సింగ్ విలేకరులకు చెప్పారు. మరోవైపు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై ఆహార భద్రత బిల్లు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నట్లు తెలిసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications