బీసిల పైన దొంగప్రేమ వలకబోస్తున్న జగన్..! బీసిల అభ్యున్నతే టీడిపి లక్ష్యమన్న బాబు..!!
అమరావతి/ హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జయహో బీసీ సభతో వైఎస్ఆర్సీపీ ఖంగారుపడిందని, ఆ షాక్ నుండి తేరుకోలేకపోవడం తోనే జగన్మోహనరెడ్డి ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం ఎలక్షన్ మిషన్ 2019పై టీడీపీ నేతలు, బూత్ స్ధాయి కన్వీనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిరాశా, నిస్పృహలతోనే వైఎస్ఆర్సీపీ ఏలూరులో సభ పెట్టారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని, జనాభాలో 50 శాతం ఉన్న బీసీల మద్దతు టీడీపీకే ఉంటుందన్నారు. దాన్ని జీర్ణించుకోలేకే వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహనరెడ్డి మొసలి కన్నీరు బీసీలు నమ్మరని చెప్పారు.
బీసీ సబ్ ప్లాన్ కు టీడీపీ ప్రభుత్వమే చట్టబద్దత కల్పించిందని, మళ్ళీ చట్టబద్దత చేస్తాననడం జగన్మోహనరెడ్డి అవివేకమన్నారు. బడ్జెట్ గురించి, నిధుల విడుదల గురించి జగన్ కు తెలియదని, ప్రాథమిక ఆర్థిక నిబంధనల పరిజ్ఞానం ఆయనకు లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఐదేళ్ళ టీడీపీ పాలనలో కౌలు రైతుల్లో పూర్తి భరోసా కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కౌలు రైతులకు కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 15వేలు ఇస్తోందని చెప్పారు. కౌలు రైతులకు 9654 కోట్ల రూపాయల మేరకు పంట రుణాలు చేయడం దేశంలోనే రికార్డు అని తెలిపారు. అలాగే కాపులకు మునుపెన్నడూ లేని లబ్ది చేశామని, కాపు కార్పొరేషన్ పెట్టి భారీ నిధులిచ్చామని, కాపు భవన్ లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
కులం, మతం మన అజెండా కాదని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ అజెండా అని చెప్పారు. పసుపు కుంకుమ ఒక అన్న ఇచ్చాడని చెల్లుళ్ళు భావిస్తున్నారని, అలాగే పెన్షన్లు తమ ఇంటి పెద్ద కొడుకు ఇచ్చాడని వృద్ధులు భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకుంటూ ముందకు పోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications