అమరావతిలో 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. నాలుగు ఆకృతులను పరిశీలించిన చంద్రబాబు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నీరుకొండలోని కొండపైన రాజధాని వైపు చూసేలా 108 అడుగల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొండపైనే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, కన్వెన్షన్ కేంద్రాలు, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు ఆకృతులను పరిశీలించారు.
వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిజానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Recommended Video
అయితే ఇప్పుడా నిర్ణయాన్ని విరమించుకుని.. నీరుకొండలోని కొండపై ఏర్పాటు చేయాలని నిన్నటి మంత్రివర్గంలో తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండడంతో విగ్రహం నీడ ఆ జలాశయంలోని నీటిలో ప్రతిబింబించనుంది.