పిట్టల్లా రాలుతున్నారు: భానుడి భగభగ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భానుడి భగభగలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. దేశం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
భానుడి భగభగలకు, వేడి గాలులు తోడవడంతో పలువురు మృతి చెందుతున్నారు. ఎండ తాకిడికి రోడ్ల పైన ఎవరూ కనిపించడం లేదు. గత సంవత్సరం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండ వేడికి తెలుగు రాష్ట్రాల్లో జనం ప్రాణాలు ఆవిరై పోతున్నాయి. కనీ వినీ ఎరుగని ఎండల తాకిడికి ఏపీలోని ప్రతి జిల్లాలోను పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
భానుడి భగభగ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భానుడి భగభగలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. దేశం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
భానుడి భగభగ
భానుడి భగభగలకు, వేడి గాలులు తోడవడంతో పలువురు మృతి చెందుతున్నారు. ఎండ తాకిడికి రోడ్ల పైన ఎవరూ కనిపించడం లేదు. గత సంవత్సరం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భానుడి భగభగ
ఎండ వేడికి తెలుగు రాష్ట్రాల్లో జనం ప్రాణాలు ఆవిరై పోతున్నాయి. కనీ వినీ ఎరుగని ఎండల తాకిడికి ఏపీలోని ప్రతి జిల్లాలోను పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
భానుడి భగభగ
శనివారం ఒక్కరోజే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలుపుకొని 262 మంది చనిపోయారు. రాత్రి పది గంటలు దాటినా వడగాలుల తీవ్రత తగ్గడం లేదు.
భానుడి భగభగ
ముఖ్యంగా వృద్ధులు, పిల్లల అవస్థలు వర్ణనాతీతం. శుక్రవారంలాగానే శనివారం కూడా ప్రకాశం జిల్లా నిప్పుల కొలిమిగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే వడగాడ్పులకు 98 మంది చనిపోయారు.
భానుడి భగభగ
నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఉభయ గోదావరి, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఎండ తీవ్రతకు తోడు ఉక్క పోతతో జనం ఉడికి పోతున్నారు.
భానుడి భగభగ
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత ఎక్కువగానే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ, ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని కలెక్టర్లను ఆదేశించారు.
భానుడి భగభగ
వరంగల్లో 62, నల్గొండలో 53, కరీంనగర్లో 46, ఖమ్మంలో 43, అదిలాబాదులో 18, మెదక్ లో 11, పాలమూరులో 9, హైదరాబాదులో 4గురు, రంగారెడ్డి, నిజామాబాదులలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
భానుడి భగభగ
శ్రీకాకుళంలో 15, విజయనగరంలో 23, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో 24 మంది చొప్పున, ప.గోదావరిలో 17, కృష్ణాలో 56, గుంటూరులో 57, ప్రకాశంలో 98, ఎస్పీఎస్ నెల్లూరులో 49, చిత్తూరులో 17, అనంతలో ఇద్దరు, కర్నూలులో నలుగురు, కడపలో ఐదుగురు చనిపోయారు.