డిసిఎం రాజయ్య కాన్వాయ్ కారు ఢీకొట్టి 7 గురికి గాయాలు

7 injured as Telangana Deputy CM's escort car hits other vehicles
వరంగల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య కాన్వాయ్‌లోని కారు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఆయన వాహనశ్రేణిలోని ఓ వాహనం ఢీకొట్టడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన వరగంల్ జిల్లాలోని రఘునాథపల్లి మండలం యశ్వంత్‌పూర్‌లో జరిగింది.

రాజయ్య కాన్వాయ్ హనుమకొండ వైపు వస్తుండగా, అందులోని ఓ వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అది ఓ స్కూటర్‌తో పాటు మరిన్ని వాహనాలను ఢీకొట్టిందని రఘునాథపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

కాన్వాయ్‌లో వాహనం ఎదురుగా వస్తున్న ఇతర వాహనాలను కూడా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురికి స్వల్ప గాయలైనట్లు, వారిని జనగాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేసినట్లు, ఆ తర్వాత వారిని డిశ్చార్జీ చేసినట్లు అధికారులు చెప్పారు.

గాయపడినవారిలో రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌కు చెందిన జి. జగన్మోహన్, కె. బాబు కూడా ఉన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజయ్య వరంగల్ జిల్లాకు చెందినవారనే విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+