వారంలో పెళ్లి: క్యాన్సర్ ఉందేమోనని యువతి ఆత్మహత్య

A girl committes suicide in Adilabad district
ఆదిలాబాద్: తన నోటి నుంచి రెండు మూడు రోజులుగా రక్తం రావడంతో తనకు క్యాన్సర్ ఉందనే అనుమానం కలిగిన ఓ యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాధ ఘటన ఆదిలాబాద్ పట్టణనంలోని ఇందిరానగర్‌లో చోటు చేసుకుంది. ఆ యువతికి వారం రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. వివాహం చేసుకుని భర్త, అత్తమామలను మోసం చేయడంకంటే ఆత్మహత్యకు చేసుకోవడమే మేలని తలిచిన ఆ యువతి తనువు చాలిచింది.

ఆదిలాబాద్ ఎస్ఐ జి రాము తెలిపిన ప్రకారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, లక్ష్మి దంపతులకు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం చేశారు. రెండు కుమార్తె అపర్ణ (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.

కాగా, ఆదిలాబాద్ మండలంలోని అనుకుంటకు చెందిన యువకుడితో అపర్ణకు ఫిబ్రవరి 17న వివాహం నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుందామని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా అపర్ణ తల్లిదండ్రులు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లారు.

మూడు రోజులుగా నోటి నుంచి రక్తం పడుతుండటంతో అపర్ణ ఆందోళనకు తీవ్ర గురైంది. తనకు బ్లెడ్ క్యాన్సర్ ఉందేమోనని భయంతో పెళ్లి చేసుకుని భర్త, అత్తామామలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు తన సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+