మురుగు కాలువలో పసికందు, కరచిన పందికొక్కులు: ఆస్పత్రిలో చేర్పించారు(ఫొటోలు)
విశాఖపట్నం: నెలైనా నిండని ఓ పసికందును నగరంలోని ఓ మురుగు కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే కేజీహెచ్కు తరలించారు. శిశువు వయసు 1-2 రోజులు ఉంటుందని కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ మధుసూదనబాబు
మురుగునీటిలో ఉండటం, పందికొక్కులు కరవడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున ఇప్పుడే ఆరోగ్య స్థితిని చెప్పలేమని కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ మధుసూదనబాబు తెలిపారు. అయితే ప్రస్తుతం శిశువు పరిస్థితి కొంత నిలకడగానే ఉందని చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. విశాఖ పాతనగరం రెల్లివీధి సమీపంలోని కుంచుమాంబ ఆలయాన్ని ఆనుకొని ఉన్న మురుగు కాలువలో బుధవారం ఉదయం 5 గంటల సమయంలో చావు బతుకుల మధ్య ఉన్న ఓ పసికందు స్థానికుల కంట పడింది.
కాలువలోకి దిగి శిశువును బయటకు తీశారు. పందికొక్కులు శిశువు కుడికాలి బొటనవేలిని కొరకడంతో రక్తం కారుతోంది. గాయాలతో విలవిల్లాడుతున్న ఆ పసికందుకు స్థానికులు తక్షణ సపర్యలు చేసి కేజీహెచ్కు తీసుకొచ్చారు.

ఆస్పత్రి పిల్లల వార్డు విభాగంలోని ఎన్ఐసీయూ ఫొటోథెరపి బల్లపై ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. రక్తం కారుతున్న చోట్ల కట్టుకట్టి పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం ఉదయంతో పోల్చితే సాయంత్రానికి శిశువు ఆరోగ్యస్థితి కొంత మెరుగైందని వైద్యులు తెలిపారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications